TG: జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో శవాన్ని కుక్కలు పీక్కు తినడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులు తెస్తామన్న మాటను ఇవాళ నిజం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ ఆస్పత్రిలో మార్చురి గది నిర్మాణం పూర్తయి.. ఏడాదిన్నర అవుతున్న ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రారంభానికి నోచుకేలేదని విమర్శించారు.