AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై నాణేలకు బదులు ముడుపుపత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతి, తిరుమలలో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా నగదును పంపితే ముడుపు పత్రాలు అందిస్తారు. వాటిని నేరుగా హుండీలో వేయొచ్చు. భక్తులకు నాణేలను, నగదును తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.