AP: రేషన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టర్లతో సమీక్షించారు. అవకతవకలకు తావులేకుండా, జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దే రేషన్ అందించాలని, ప్రతి నెలా 15వ తేదీ వరకు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఆదివారాల్లోనూ రేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు.