AP: శాసనసభలో ప్రభుత్వం ఇవాళ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అసైన్డ్ భూముల చట్టసవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టగా.. గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పునకు సంబంధించిన బిల్లును మంత్రి డోలా వీరాంజనేయస్వామి సభ ముందు ఉంచారు. ఇకపై వీటిని స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు సచివాలయాలుగా పిలవనున్నారు.