AP: కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రన్వేపై నుంచి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. దీంతో రన్వేపైనే విమానాన్ని ఆపేశాడు. ఆ విమానంలో మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో సహా 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.