TG: శారదా పీఠం భూములపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వానికి వక్ఫ్ భూముల జోలికి వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. శారదా పీఠం పక్కనే మైనింగ్ భూములు ఉన్నాయని తెలిపారు. మరి వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. కేవలం ఒక వర్గానికి చెందిన పీఠాన్ని లేదా సంస్థను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆరా తీస్తున్నారని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు.