AP: సోషల్ మీడియా క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్న సంస్థలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లు ప్రకటనల ఆదాయంలో 55 శాతం క్రియేటర్లకు ఇస్తుండగా, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఎత్తిచూపారు. మనదేశ క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.