TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చిందట. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తిస్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల అధ్యక్షులు సగానికి పైగా ‘స్వాహా’ చేశారని గుర్తించందట. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చారట. దీంతో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోనుందట.