AP: వైసీపీ పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఇవాళ్టి నుంచి వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే రైతులతో కలిసి వైసీపీ నేతలు కలెక్టరేట్లకు ర్యాలీగా తరలి వెళ్లి వినతి పత్రాలను అందజేయనున్నారు. ధాన్యం కొనుగోలు, రూ.20 వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపైన వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని మాజీ సీఎం ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.