AP: గన్నవరం నుంచి కడప విమానాశ్రయం డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి రిమ్స్కు బయలుదేరారు. కాసేపట్లో రిమ్స్లో గాలివీడు MPDO జవహర్ బాబును పరామర్శించనున్నారు. కాగా, ఎంపీడీవోపై దాడి ఘటనలో 13 మందిపై గాలివీడు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.