NRML: పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలలో శనివారం ఉదయం రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. ముస్లింలు ఉదయాన్నే ఈద్గా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.