శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఐరన్ మాత్రలను పరగడపున తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మాత్రలు వేసుకున్న గంట వరకు పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఇతర మందులతో వీటిని కలిపి వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.