వేసవిలో ఎయిర్ కండిషనర్(AC) కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్. ఈ ఏడాది ఏసీల ధరలు 5 నుంచి 15% పెరిగే అవకాశం ఉందని ఏసీల తయారీ సంస్థ వోల్టాస్ తెలిపింది. ఏసీల తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని వోల్టాస్ ఎండీ మేనన్ వివరించారు. గతేడాది టన్నుకు 8,500 డాలర్లుగా ఉన్న రాగి ధర ఇప్పుడు 12,000 నుంచి 13,000 డాలర్లకు చేరిందన్నారు.