AP: మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అయితే, నిరసనలకు అనుమతి లేదంటూ పలువురు YCP నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మాజీమంత్రి చెల్లుబోయిన వేణు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి నోటీసులు ఇచ్చారు. మాజీమంత్రి విడుదల రజిని, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, భార్గవరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.