AP: ముస్లింలకు హోంమంత్రి అనిత రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో కూడిన ప్రార్థనలు పూర్తి చేసుకుని.. ఇవాళ భక్తిశ్రద్ధలతో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లాహ్ కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.