TG: ఎస్సీల వర్గీకరణ కోసం వారి వెంటే నడిచానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బలహీనవర్గాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కర్ణుడు తన చివరి శ్వాస వరకు మిత్ర ధర్మాన్ని పాటించాడని.. అలాగే తాను కూడా మాదిగల వెంట ఉంటానని ఉద్ఘాటించారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలు చూస్తునే ఉన్నానని అన్నారు.