TG: పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. HYD పరిధిలోని మెట్రో AC, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగా’ అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని సూచించారు.