TG: MGBS బస్టాండ్లో ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఇందులో మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. చేనేత, హస్తకళలకు చేయూతనిచ్చేలా జీఐ ఆన్ వీల్స్ పేరుతో బస్లపై ప్రచారం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ కృషిని ఆయన అభినందించారు.