ఎలక్ట్రిక్ టూవీలర్లు కొనేవారికి కేంద్రం సరికొత్త బూస్ట్ ఇవ్వనుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈవీ వాహనాలపై రాయితీలను పెంచేందుకు భారీ పరిశ్రమల శాఖ యోచిస్తోంది. ఇందుకోసం అదనపు నిధులు కేటాయించాలని కోరనుంది. 2026 FYగానూ ఈ స్కీమ్కు ఇప్పటికే రూ.10,900 కోట్లు కేటాయించగా, పరిశ్రమల డిమాండ్ మేరకు ఈ సబ్సిడీల గడువును జూలై చివరి వరకు పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.