AP: తీర ప్రాంత ఇసుక ఖనిజాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు పుష్కలంగా బీచ్ శాండ్ మినరల్ నిక్షేపాలు ఉన్నాయన్నారు. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాలకు వనరులుగా బీచ్ శాండ్ మినరల్స్ వనరుగా మారనున్నాయని తెలిపారు. ఖనిజాల శాఖలో పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.