TG: ఆచార్య నాగార్జున యునివర్సిటీ ఎదురుగా బీసీ సింహ గర్జన పేరుతో రేపు నిర్వహించనున్న బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభ నిర్వహణకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.