TG: రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతవరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, నిన్న కామారెడ్డి, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది.