ELR: భీమడోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో పద్మావతిదేవి సోమవారం తెలిపారు. భీమడోలు ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆమె కోరారు. మండల స్థాయి అధికారులు తమ శాఖలోని అభివృద్ధి నివేదికలతో హాజరు కావాలని ఆమె కోరారు.