MBNR: మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి అధిక నిధులు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.