MHBD: మహబూబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన యువకులు అర్హులని ఆమె వెల్లడించారు. ఉదయం 10 గంటల లోపు అర్హత పత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.