AP: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విశాఖ-అబుధాబి మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. వైజాగ్ నుంచి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో అబుదాబికి విమాన సర్వీసులు నడుస్తాయి. నిత్యం సుమారు 170 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆది, సోమవారాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం కూడా సర్వీసులు రద్దయినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.