TG: రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం అభిషేక్ మను సింఘ్వీతో పాటు రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈ ఇద్దరు నేతలు ఇవాళ అసెంబ్లీలో తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఈ అవకాశం దక్కడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.