TG: క్రీడల్లో యువత రాణించేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు అన్నారు. ప్రపంచ వేదికలపై భారతీయ త్రివర్ణ పతాకాన్ని మన క్రీడాకారులు ఎగురవేస్తున్నారని అభినందించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ప్రధాని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అలాగే, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.