TG: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల్ వాసి మృతి చెందారు. సౌదీ అరేబియా ఓమ్ లోజ్ మదీనా ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ కు చెందిన మహమ్మద్ జావిద్(42) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.