TG: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) టన్నెల్ పనులు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్లో ప్రమాదం జరగడంతో పనులు నిలిచిపోయాయి. ఆగిపోయిన పనులను అవుట్లెట్(దేవరకొండ) వైపు ఫిబ్రవరి 3వ వారంలో, ఇన్లెట్(దోమలపెంట) వైపు ఈనెల 20న ప్రారంభించారు. 2027 చివరి నాటికి పనులు పూర్తి చేసి, 2028 జూన్ నాటికి అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.