MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో ప్రజలకు ఆదివారం తొర్రూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తొర్రూరు సీఐ గణేష్ మాట్లాడుతూ… సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ తప్పకుండా ధరించాలని సూచించారు. యువత చెడు వ్యసనాల బారిన పడి జీవితాన్ని ఆగం చేసుకోవద్దని కోరారు.