VZM: సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలని ఏపీ రజక సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కెల్ల సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం గజపతినగరంలో రజకలతో సమావేశం నిర్వహించారు. సమస్యలపై ఏప్రిల్ 13వ తేదీన రజకులు కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తారని అన్నారు. రజకలను ఎస్సీలో చేర్చినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తామాడ అచ్చన్న, టీవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.