AP: డిప్యూటీ సీఎం పవన్ చొరవతో నంద్యాల జిల్లా కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల సమంలో ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా కొణిదెల గ్రామస్థులు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించి గతేడాది అభివృద్ధికి రూ.50 లక్షల విరాళం అందించారు. ఆ నిధులతో అక్కడ 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ నీటి ట్యాంకు నిర్మించారు.