AP: కేంద్రం తెచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్ల అమలుపై రాష్ట్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంస్కరణలపై స్టేక్ హోల్డర్ల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. చట్టాల సరళీకరణ, ఆధునీకరణ ద్వారా కార్మికుల హక్కులను రక్షిస్తూనే.. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మార్చి 15లోగా ఈ సూచనలు అందజేయాలని ప్రభుత్వం కోరింది.