AP: చిత్తూరు పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడితోనే వైసీపీ నీచ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. దేవుడిపై భక్తి, హిందువుల మనోభావాలపై జగన్కు గౌరవం లేదన్నారు. చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి ఫొటోలతో నిరసన తెలిపారని ఫైర్ అయ్యారు. టీటీడీ సంప్రదాయాలు, హిందూ విశ్వాసాలపై జగన్కు చిన్నచూపు అని విమర్శించారు.