AP: మండలిలో తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో మండలి ఛైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ మండలికి వచ్చారు. నిజాలు బయటపడతాయనే మండలిని వాయిదా వేస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.