AP: విద్య, ఉపాధ్యాయ సమస్యలు, ఆర్థిక డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఏపీటీఎఫ్ మహాధర్నాలు నిర్వహించనుంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం కనిపించలేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు తెలిపారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.