రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్కు వైద్యం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును ధర్మాసనం తప్పుపట్టింది. దల్లేవాల్ క్షేమం కోరుకునే వాళ్లు అలా అడ్డుకోరని, ఈ విషయాన్ని వారికి తెలియచేయాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించింది. కాగా.. దల్లేవాల్ నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.