VZM: నెల్లిమర్ల మండలంలోని సతివాడ గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర గురువారం రాత్రి ఘనంగా జరిగింది. సుమారు 20 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారి అలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారి చదును నుంచి సిరిమాను మూడు సార్లు తిరిగింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనంకు భక్తులు పోటీపడ్డారు.