విజయ్ దేవరకొండ, రష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి వివాహానికి నటి కళ్యాణి ప్రియదర్శన్ హాజరై సందడి చేసింది. ఈ వివాహాన్ని చూడడం తన అదృష్టమంటూ తాజాగా ఆమె పోస్ట్ చేసింది. విజయ్, రష్మిక మండపం వైపు వస్తున్నప్పుడు వారిద్దరి కళ్లల్లో ఆనందభాష్పాలు వారి ప్రేమకు చిహ్నాలుగా నిలిచాయని తెలిపింది. ఈ జంటను చూడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.