AKP: మాడుగుల మండలం జంపిన గ్రామానికి చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో దొంగతనం కేసు మీద జైలుకు వెళ్లి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు. మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.