‘పుష్ప’ మూవీతో టాలీవుడ్లో ఫహాద్ ఫాజిల్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ తప్ప మరే ఇతర తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విలన్ పాత్రల కోసం ఆయన ఏకంగా రూ.15-20 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంత పెద్ద మొత్తం ఇవ్వలేక టాలీవుడ్ నిర్మాతలు వెనుకంజ వేయడంతో, ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయని టాక్ నడుస్తోంది.