తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్యూడ్’ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటించారు.