రజినీకాంత్, షారుఖ్ ఖాన్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ రవిచందర్ తన ‘డ్రీమ్ కాంబినేషన్’ గురించి మాట్లాడుతూ, రజినీ, షారుఖ్లను ఒకే తెరపై చూడటమే తన లక్ష్యమని వెల్లడించాడు. వీరికి సంగీతం అందించడం తన కెరీర్లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అన్నాడు. దీంతో నెటిజన్లు ఈ కాంబో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.