ప్రధాని నరేంద్ర మోదీని హీరో విజయ్ దేవరకొండ కలిశాడు. ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్లో ప్రధాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, హీరోయిన్ యామి గౌతమ్, బ్యాట్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ కలిసి ప్రధానితో ఫొటో దిగారు.