MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 19న జరగాల్సిన వారాంతపు సంత (తైబజార్) వేలం ఉగాది పండుగ సందర్భంగా వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ ఈ వేలం పాటను ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల వేలందారులు ఈ మార్పును గమనించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.