అక్కినేని నాగార్జున సాధారణంగా పెద్ద ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. నిజానికి చాలా రీజనబుల్గా మాట్లాడుతుంటారు. నిజాయితీగా ఉంటాయి ఆ మాటలు కూడా. అలాటిది తన మాటలను పూర్తిగా వక్రీకరించి, మీమ్స్ చేసి, వెబ్ సైట్స్లో రాసి రచ్చ చేశారని నిన్న జరిగిన కుబేర సక్సెస్ మీట్లో బాధపడ్డారు నాగార్జున. మొన్ని రిలీజైన వెంటనే వచ్చిన హిట్ టాక్ దృష్ట్యా, ఏషియన్ ఫిల్మ్స్ ఆఫీసులో ఆర్జంట్ ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాతలు. దానికి నాగార్జున కూడా హాజరయ్యారు.
అప్పుడు జరిగిన ప్రెస్ మీట్లో చిన్నపాటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా జరిగింది. అందులో నాగార్జున అన్నమాటలనే సోషల్ మీడియా తప్పుగా ఫ్రేం చేసిందనే నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫంక్షన్లో మాట్లాడుతూ’’ మొన్న జరిగిన ప్రెస్మీట్లో జర్నలిష్టు నాగేంద్ర ఓ ప్రశ్న వేశాడు. మీరెందుకు ఈ పాత్రని ఎంచుకున్నారు అని. దానికి నేను ఇందులో నా క్యారెక్టరే సినిమాలో ప్రధానమైన పాత్ర. అందుకే నేను ఒప్పుకున్నాను అని చెప్పాను. కానీ నేను చెప్పింది ఒకటైతే, దానికి వేరే మీనింగ్ తీసి మీమ్స్ చేసి నాకు పంపించారు. వెబ్సైట్స్ కూడా ముందంతా శేఖర్ కమ్ముల సినిమా అని చెప్పాను. సినిమా రిలీజై హిట్ టాక్ వచ్చిన తర్వాత నా సినిమా అని చెప్పాను అని రాశారు. కానీ ఇప్పుడు చెబుతున్నాను. ఇది దీపక్ సినిమా, ఇది దేవా సినిమా, ఇది సమీర సినిమా, ఇది ఖుష్బూ సినిమా. ఫైనల్గా ఇది దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అని ఘంటా పథంగా చెబుతున్నాను.’’ అని వివరణ ఇచ్చారు నాగార్జున.
సోషల్ మీడియా ధోరణులకు ఎవరూ అతీతం కాకుండా పోయిందనే విమర్శ సర్వత్రా ఉంది. ఏ మాట అనడానికి, అస్సలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా స్టార్స్ భయసడుతున్నారు. వాళ్ళ అభిప్రాయాలేమైనా ఉంటే గనక, వాటిని ఎక్స్ హేండిల్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో మాత్రమే తెలియజేస్తున్నారు గానీ, మీడియాతో పర్సనల్గా ముచ్చటించడానికి ముందుకు రాలేకపోతున్నారు క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉన్న ఏ ఒక్కరూ కూడా. పూర్తిగా సోషల్ మీడియా ప్రపంచమై పోయింది. ఇక్కడ ఎవరూ కూడా నోరు విప్పి మనసుకు నచ్చిన విధంగా మాట్లాడే అవకాశం గానీ, ఆస్కారం గానీ లేకుండా పోయింది. ముఖ్యంగా సూపర్ స్టార్స్ అనిపించుకున్నవాళ్ళైతే ఇంక వాళ్ళ బ్రతుకు దుర్భరం అయిపోయింది. దానికి నిన్న నాగార్జున ఇచ్చుకున్న వివరణే తాజా నిదర్శనం.