KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రెవెన్యూ సమస్యలపై అధికారులతో శనివారం సమావేశమయ్యారు. భూ తగాదాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిచేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.