• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

దుబాయిలో యువకుడి మృతి.. ఎమ్మెల్యేను ఆశ్రయించిన కుటుంబం

JN: మాన్సింగ్ తండాకు చెందిన భూక్య శ్రీను ఉపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడ మృతి చెందాడు. బాధితుడి బంధువులు, స్థానిక నాయకులు జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, మృతదేహం త్వరగా చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు

February 22, 2026 / 07:06 AM IST

నగరంలో చికెన్ ధర ఎంతంటే.!

HYD: నగరంలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 07:05 AM IST

నేడు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సత్య నారాయణపురంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు.

February 22, 2026 / 07:05 AM IST

గుప్త నిధుల పేరిట భారీ మోసం

MBNR: గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి రూ.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందుగా పాతిపెట్టిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తవ్వి, కోట్ల రూపాయల విలువ ఉందని నమ్మించి బాధితుడిని మోసం చేసినట్లు వివరించారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

February 22, 2026 / 07:04 AM IST

కారు బోల్తా… నలుగురికి గాయాలు

WGL: రాయపర్తి మండల కేంద్రంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు యువకులు గాయపడ్డారు. జేతురాం తండా పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తండాకు చెందిన వారు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా నేడు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రాయపర్తి నుంచి తండాకు వెళ్తుండగా కారు రహదారి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 07:04 AM IST

సర్పంచుల శిక్షణా తరగతులలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం నగరంలోని DPRC భవనంలో నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజల నమ్మకాన్ని గెలిచి ఎన్నికైన సర్పంచులు గ్రామ పాలనలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సర్పంచుల బాధ్యతలతో పాటు ప్రజలకు అందించాల్సిన సేవలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు.

February 22, 2026 / 07:00 AM IST

రెంజల్‌లో అక్రమ ఇసుక డంపులు సీజ్

NZB: రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో శనివారం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అక్రమ ఇసుక డంపులను సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 26 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తనను అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

February 22, 2026 / 07:00 AM IST

నేడు కరెంట్ కట్

MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

February 22, 2026 / 07:00 AM IST

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

భువనగిరిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో అడ్మిషన్‌తో పాటు 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 22, 2026 / 06:59 AM IST

హాజరుకానున్న 12,334 మంది విద్యార్థులు: డీఐఈవో

MDK: ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. మొత్తం విద్యార్థులు-12,334, ఫస్ట్ ఇయర్ జనరల్-5710, ఫస్ట్ ఇయర్ ఒకేషనల్-599, మొత్తం-6309, సెకండ్ ఇయర్ జనరల్–5472, సెకండ్ ఇయర్ ఒకేషనల్-533, మొత్తం-6025, పరీక్ష కేంద్రాలు -28, ఫ్లైయింగ్ స్క్వాడ్-5 ఉన్నట్లు వెల్లడించారు.

February 22, 2026 / 06:58 AM IST

ఘనంగా కొనసాగుతున్న జ్యోతిర్లింగ శివాలయం ఉత్సవాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తాంబేలు గుట్టపై జ్యోతిర్లింగ శివాలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేకంగా స్వలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 22, 2026 / 06:55 AM IST

రోజు రోజుకు దిగజారుతున్న ప్రయాణికుల సౌకర్యం

BDK: పాల్వంచ RTC బస్ స్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చెట్ల కింద ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన బెంచ్‌లను తొలగించి ఎండలో పడేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు చెట్ల నీడలో వేచి ఉండే సౌకర్యం పూర్తిగా లేకుండా పోయింది. కనీసం టూ వీలర్ కార్లు ఆపడానికి కూడా సౌకర్యం లేదన్నారు.

February 22, 2026 / 06:47 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి: ఘనపురం మండలం సోలిపురం గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోలిపురంలోని బాధిత కుటుంబాన్ని పరమర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని కుటుంబానికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 AM IST

దొంగ వస్తువులు కొనుగోలు.. యజమాని అరెస్ట్

ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్‌వెల్ పైపులను దొంగలించి ముజాహిద్‌కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 06:37 AM IST

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు.

February 22, 2026 / 06:33 AM IST