NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ సిబ్బందితో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల చేతి వేలి ముద్రలను ప్రత్యేక డివైజ్తో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల ప్రజలు ఆస్తి పన్నును గడువులోగా చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజు శనివారం ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూలుకు 18 బృందావనం ఏర్పాటు చేశామని ఇందుకోసం వార్డు ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారని ఆయా వార్డ్ ఆఫీసర్లకు తమ పన్నులను చెల్లించి అధికారులకు సహకరించాలని తెలిపారు.
SRPT: రాబోయే వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. నర్సింహులు అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
BHPL: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇందిర సూచించారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలు శనివారం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. హుజూర్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్, విజ్ఞాన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
RR: షాద్ నగర్ పట్టణంలోని 20వ వార్డులో తాగునీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. నెలరోజులుగా బోరు పాడు కావడంతో ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజలు ఈ విషయాన్ని కౌన్సిలర్ గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ బోరును బాగు చేయించి తాగునీటి ఎద్దడిని తీర్చారు. దీంతో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కం రాజశేఖర్ (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న లక్కం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
BHNG: రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాడనే కక్షతోనే బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని అన్నారు.
PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ రీజియన్ సెంటర్ ఆధ్వర్యంలో జావా, వెబ్ డెవలప్మెంట్, సీ, HTML, CSS, జావా స్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, మొదలైన కోర్సుల్లో ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9059506807లో సంప్రదించాలి.
JNG: బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. అధ్యక్షులుగా జుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు, సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లు, సలహాదారులుగా చింతపండు ఆంజయ్య, మట్టి బిక్షపతి, క్రిష్ణలు ఎన్నికయ్యారు.
MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలు, వీకెండ్ కావడంతో యాదగిరిగుట్టకు భారీగా భక్తులు తరలివచ్చారు.
KMR: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ అన్నారు. శాయంపేటలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, ఇతర హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ ఉన్నారు.
BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల గ్రామ పంచాయతీకి మత్స్య శాఖ కింద లైవ్ ఫిష్ వెహికల్ మంజూరు అయింది. శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించి సంఘం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.